Saturday, April 27, 2024
- Advertisement -

గంగవ్వ కి చిరంజీవి భరోసా.. ఏంటి ఈ కథ ?

- Advertisement -

ప్రస్తుతం బాస్ హౌస్ 4 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సారి సీనియ కంటెస్టెంట్ గంగవ్వ కూడా బిగ్ బాస్ లో పాల్గొంది. గేమ్ కూడా అద్భుతంగా ఆడుతోంది. అయితే భారత దేశం లోనే 60 ఏళ్ళ వయసులో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ మాత్రం గంగవ్వనే. ఈమె మైవిలెజ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాగా ఫేమస్ కావడం వల్ల బిగ్ బాస్ లో ఆఫర్ దక్కింది. హౌస్ లో గంగవ్వ ఉండాలని ఆమెకి ఓట్లు కూడా బానే పడుతున్నాయి.

అయితే గంగవ్వ వచ్చిన కొత్తలో హౌస్ లో ఉండలేకపోయింది. ఇంటికి వెళ్తా అని బిగ్ బాస్ ముందు బోరున ఏడ్చింది. అప్పుడు బిగ్ బాస్ ఆమె ధైర్యం చెప్పి చక్కన వైద్యం అందించడంతో ఆమెలో కొత్త ఉత్సహం వచ్చింది. అప్పటి నుంచి చాలా హుషార్ గా గేమ్ ఆడుతుంది. రిస్క్ గేమ్ లు గంగవ్వ చేత ఆడించకుండా బిగ్ బాస్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటిలోని సభ్యులు కూడా గంగవ్వను చాలా జాగ్రత్తగా చాలా బాగా చూసుకుంటున్నారు. గంగవ్వ బిగ్ బాస్ లో గెలిచిన ఓడినా ఓ ఇంటిని కట్టుకుంటాను అని చెప్పింది.

దాంతో ప్రస్తుతం గంగవ్వకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇది ఇలా ఉంటే గంగవ్వ బాధని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెలించిపోయారని కొత్తగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి గారు గంగవ్వ బాధని చూసి బిగ్ బాస్ టీం తో మాట్లాడి ఆమె ఆరోగ్యం విషయం తెలుసుకుని నాగార్జున గారితో కూడా మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి కేవలం పుకార్లే అని కొందరు అంటున్నారు. ఏది ఏమైన గంగవ్వ మాత్రం తన వయసు కు మించి గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

బిగ్ బాస్ 4 కు నాగార్జున బై.. ఏం జరిగింది ?

బాలు గారికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

హరీష్ శంకర్ పవన్ తో మిరపకాయ 2 చేస్తున్నారా…?

మహేష్ , బన్నీ కి వారు కరువయ్యరుగా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -