నందమూరి కళ్యాణ్రామ్ తొలిసారిగా చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నా నువ్వే’. ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.మొదటిసారిగా జతకొట్టిన ఈ జోడి.. చాలా బాగుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మహేశ్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ను పొందింది.చిత్ర నిర్మాతలు కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి మాట్లాడుతూ.. ”మా ‘నా నువ్వే’ చిత్రాన్ని జూన్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ఫ్రెష్ లుక్ లవ్స్టోరీ. జయేంద్రగారు సినిమాను అద్భుతమైన ఫీల్తో తెరకెక్కిస్తే.. పి.సి.శ్రీరామ్గారు ఎక్స్ట్రార్డినరీ విజువల్స్తో ప్రతి ఫ్రేమ్ను అందంగా చూపించారు. కల్యాణ్ రామ్, తమన్నాలను సరికొత్త డైమన్షన్లో ప్రెజెంట్ చేసే చిత్రమిది. హృదయాన్ని హత్తుకునే క్యూట్ అండ్ బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్స్టోరీ మా ‘నా నువ్వే’ చిత్రం” అన్నారు.