కమల్ హాసన్ విశ్వరూపం- 2కు కూడా కాలం కలిసి రావడం లేదు. విశ్వరూపం మొదటి పార్ట్ అనేక వివాదాల నడుమ విడుదలైన సంగతి తెలిసింది.తాజాగా ఆయన విశ్వరూపం- 2 కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతు ఈ నెల 10న విడుదల చేయడానికి రెడీ అయ్యారు.తాజాగా అందిన సమాచారం ప్రకారం విశ్వరూపం -2 మళ్లీ వాయిదా పడిందని తెలుస్తుంది.తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించడంతో తన సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడట కమల్.
కరుణానిధి మరణించడంతో థియేటర్లు రెండు రోజుల పటు స్వచ్ఛదంగా బంద్ పాటిస్తుండడంతో తమిళనాడులో సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించే అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా వాయిదా వేయడమే కరెక్ట్ అని భావించిన కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.సినిమాను ఈ నెల 15న విడుదల చేయలని ఆలోచిస్తున్నారు.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.