ఒకప్పుడు సినీ రంగంలో తమ సత్తా చాటిన హీరోలు తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంచి పేరు సంపాదించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి మేటి నటులు సొంత పార్టీ పెట్టి ప్రజల్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సినిమా హీరోలు రాజకీయాల్లో రాణించే కాలం చెల్లిపోయిందని ఇటీవల పలు ఉదాహరణలు నిరూపించాయి, నిరూపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సొంత పార్టీ పెడతా అని ఊరిస్తూ ఉరిస్తూ చివరికి అనారోగ్య కారణంగా ఆ నిర్ణయం విరమించుకున్నానని తెలిపారు. ఇక పోతే విశ్వనటుడు కమల్ హాసన్ సొంత పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి అయిపోయేంత సీన్ లేదు కానీ, కనీసం కమల్ అసెంబ్లీ సీటైనా గెలుస్తారా అనేది నిన్నటి వరకూ అనుమానమే.
కానీ ఈ విశ్వనటుడికి భలే కలిసి వచ్చేసిందని అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి సినీ నటుడు కమల హాసన్కు చెందిన మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) వర్గాలు పలు వివరాలు తెలిపాయి. తమ పార్టీ అధ్యక్షుడు కమల హాసన్ కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచిపోటీ చేయనున్నారని వెల్లడించాయి. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో ఉన్న అర్బన్ ఓట్లపై ఆయన దృష్టిపెట్టారు. దీని వెనక ఓ బలమైన కారణం ఉంది.
ఇక్కడ డీఎంకే కానీ, అన్నా డీఎంకే కానీ పోటీలో దిగడం లేదు. ఆ సీటుని ఆల్రెడీ బీజేపీకి త్యాగం చేసింది అన్నాడీఎంకే. అటు ఆ సీటు కాంగ్రెస్ కి కేటాయించడానికి డీఎంకే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ప్రధాన పార్టీలేవీ బరిలో లేకపోవడం కమల్ కి పెద్ద ప్లస్ పాయింట్. అంతే కాదు ఆ స్థానంలో తెలుగువారు ఎక్కువగా ఉండడం, తన అభిమానులూ ఆ నియోజకవర్గంలో అధికంగా ఉండడంతో ఇక్కడి నుంచే పోటీ చేయాలని కమల్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయంపై కమల హాసన్ స్పందిస్తూ… తన తండ్రి తనను ఐఏఎస్ అధికారిగా చూడాలనుకున్నారని చెప్పారు.. ఆయన కల నెరవేరలేదు.. కానీ ఈ నేపథ్యంలోనే తమ పార్టీలో పలువురు మాజీ ఐఏఎ్సలకు చోటు కల్పించానని చెప్పారు. రాజకీయాలు తన వృత్తి కాదని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తల కోరిక మేరకే తాను కోయంబత్తూరు దక్షిణ స్థానం నుంచి పోటీ చేస్తున్నానన్నారు.
సన్నిహితుల సమక్షంలో… నటి మెహ్రీన్ నిశ్చితార్థం..!