- Advertisement -
కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ‘కడైకుట్టి సింగం’ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో హీరోయిన్గా అఖిల్ ఫేం సాయేషా సైగల్ నటిస్తుంది.ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయలని భావిస్తున్నారు చిత్ర నిర్మాతలు.తెలుగులో సినిమా టైటిల్ను చినబాబుగా నిర్ణయించారు.తాజాగా ఈ సినిమాకు సంబధించిన టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
పంటలు .. పచ్చదనం .. ప్రేమలు .. ఆప్యాయతలతో కూడిన గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందనే విషయం ఈ టీజర్ వలన అర్థమవుతోంది.’నువ్వు రైతువైతే కాలర్ ఎగరేసుకు తిరుగు అంతే’ అంటూ కార్తీ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.