పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సినిమా విడుదల నేపథ్యంలో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.
సీరియస్ గా ఉన్న కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టారని మహేష్ అన్నారు. సినిమాను అపహాస్యం చేసిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ అని తెలిపారు. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్యంత దారుణమైన సినిమా ఇది అంటూ విమర్శించారు. ‘రిస్క్ చేసి చూస్తే… టైమేమో…’ (ఈ సినిమాలో ఓ పాట ఈ ట్యూన్ లో ఉంది) అంటూ కామెంట్ చేశారు. మళ్లీ పవన్ ఫ్యాన్స్ దీనిపై ఏవిధాంగా స్పందిస్తారో.అసలే పవన్ ఫ్యాన్స్కు కత్తి మహేష్కు అసలు పడటం లేదు.సోషల్ మీడియా సాక్షిగా వీరి మధ్య యుధ్దం నుడుస్తుంది.
సీరియస్ కథకి కామెడీ కథనంతో చికాకుపెట్టి సినిమాను అపహాస్యం చేసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కెరీర్ లో అత్యంత దారుణమైన సినిమా.
రిస్క్ చేసి చూస్తే…టైమెమో… మీ ఇష్టం!(ఈ సినిమా పాట ట్యూన్ లో).— Kathi Mahesh™️ (@kathimahesh) January 10, 2018