Tuesday, May 7, 2024
- Advertisement -

పండ‌గ రోజు పోలీసుల ముందుకు

- Advertisement -

అమ‌లాపాల్ ఏం చేసిన సంచ‌ల‌న‌మే.త‌న‌పై వ‌చ్చే కామెంట్ల‌కు తనే సైట‌ర్ వేసుకుని అంద‌రిని ఆశ్చ‌ర్యప‌రిచింది.త‌న బొడ్డు అంత అందంగా ఉంటుంది అని నాకు తెలియ‌ద‌ని ఈ భామ సైట‌ర్ వేసింది.విష‌యం ఏమిటంటే ఇప్పుడు పోలీసుల ముందుకు రావలసిన పరిస్థితి ఏర్ప‌డింది.ఏమిటీ గొడవ అనుకుంటున్నారా?వివాహానికి ముందు వివాహరద్దు తరువాత కూడా కథానాయకిగా బిజీగా ఉన్న అరుదైన నటీమణుల్లో ఒకరు అమలాపాల్‌.

ఈమెను పోలీస్‌ కేసు వ్యవహారం మాత్రం చిక్కుల్లో పడేసింది. ఈ అమ్మడు ఆ మధ్య ఖరీదైన కారును కొనుగోలు చేసి తాను పుదుచ్చేరిలో నివశిస్తున్నట్లు నకిలీ ఆధారాలతో పుదుచ్చేరిలో రిజిస్టర్‌ చేసుకున్నారు. అక్కడ ట్యాక్స్‌ తక్కువ కావడంతో అమలాపాల్‌ కక్కుర్తిపడ్డారనే ఆరోపణలు వెల్వువెత్తాయి. అలా కేరళా ప్రభుత్వ రవాణా శాఖకు ఈ అమ్మడు లక్షల్లో పన్నుకు కుచ్చు టోపి పెట్టేశారు.

దీంతో మేలుకున్న కేరళా పోలీసులు అమలాపాల్‌పై పన్ను ఎగవేత కేసును నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పలుమార్లు వివరణ కోరుతూ పోలీసులు సమన్లు జారీ చేసినా అమలాపాల్‌ పట్టించుకోలేదు. దీంతో పోలీసులు కేరళా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్‌ చేస్తారేమోనన్న భయంతో అమలాపాల్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారించిన న్యాయస్థానం అమలాపాల్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు ఈ నెల 15వ తేదీ ఆమె పోలీసుల ముందు హాజరై కారు కొనుగోలు, నకిలీ ఆధారాలతో రవాణా శాఖ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేసిన వ్యవహారం గురించి వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.దీంతో అమలపాల్‌కు పోలీసుల ముందుహాజరుకాక తప్పనిసరి అయ్యింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -