అమలాపాల్ ఏం చేసిన సంచలనమే.తనపై వచ్చే కామెంట్లకు తనే సైటర్ వేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.తన బొడ్డు అంత అందంగా ఉంటుంది అని నాకు తెలియదని ఈ భామ సైటర్ వేసింది.విషయం ఏమిటంటే ఇప్పుడు పోలీసుల ముందుకు రావలసిన పరిస్థితి ఏర్పడింది.ఏమిటీ గొడవ అనుకుంటున్నారా?వివాహానికి ముందు వివాహరద్దు తరువాత కూడా కథానాయకిగా బిజీగా ఉన్న అరుదైన నటీమణుల్లో ఒకరు అమలాపాల్.
ఈమెను పోలీస్ కేసు వ్యవహారం మాత్రం చిక్కుల్లో పడేసింది. ఈ అమ్మడు ఆ మధ్య ఖరీదైన కారును కొనుగోలు చేసి తాను పుదుచ్చేరిలో నివశిస్తున్నట్లు నకిలీ ఆధారాలతో పుదుచ్చేరిలో రిజిస్టర్ చేసుకున్నారు. అక్కడ ట్యాక్స్ తక్కువ కావడంతో అమలాపాల్ కక్కుర్తిపడ్డారనే ఆరోపణలు వెల్వువెత్తాయి. అలా కేరళా ప్రభుత్వ రవాణా శాఖకు ఈ అమ్మడు లక్షల్లో పన్నుకు కుచ్చు టోపి పెట్టేశారు.
దీంతో మేలుకున్న కేరళా పోలీసులు అమలాపాల్పై పన్ను ఎగవేత కేసును నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పలుమార్లు వివరణ కోరుతూ పోలీసులు సమన్లు జారీ చేసినా అమలాపాల్ పట్టించుకోలేదు. దీంతో పోలీసులు కేరళా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో అమలాపాల్ ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారించిన న్యాయస్థానం అమలాపాల్ పిటిషన్ను కొట్టివేయడంతో పాటు ఈ నెల 15వ తేదీ ఆమె పోలీసుల ముందు హాజరై కారు కొనుగోలు, నకిలీ ఆధారాలతో రవాణా శాఖ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేసిన వ్యవహారం గురించి వివరణ ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.దీంతో అమలపాల్కు పోలీసుల ముందుహాజరుకాక తప్పనిసరి అయ్యింది.