Wednesday, April 24, 2024
- Advertisement -

మహానటి తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -

తెలుగులో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో కీర్తిసురేష్ ఒకరు. నటన పై ఉన్న ఆసక్తితోనే చిన్నప్పుడే కెమెరా ముందు కనిపించి తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది.కీర్తి సురేష్ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ “మహానటి” సినిమాలో అలనాటి తార సావిత్రి బయోపిక్ లో ఎంతో అద్భుతంగా నటించారు.

మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డును తీసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కీర్తి సురేష్ చిన్నప్పుటి విషయాలను పంచుకున్నారు. నటనపై ఆసక్తి ఉండటం వల్ల బాల్యంలోనే సినిమాలలో నటించారు. ఈ విధంగా కెమెరా ముందు కనిపించడంతో నిర్మాతలు డబ్బుల కవర్ తన చేతిలో పెట్టేవారని, అందులో ఎంత ఉందో కూడా చూడకుండా తన తండ్రి చేతిలో పెట్టేదని తెలిపారు.

Also read:టాలీవుడ్ హీరోయిన్లను దూరం పెడుతున్న ప్రభాస్.. కారణం అదేనా?

కాలేజీ రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో ఒక షోలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ షోలో పాల్గొన్నందుకు గాను ఈమెకు 500 రూపాయలు పారితోషికం ఇచ్చినట్లు తెలిపారు.ఆ 500 రూపాయలే తనకు గుర్తున్న తొలి పారితోషకం అని కీర్తి సురేష్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.ఆ 500 రూపాయలను కూడా తన తండ్రికి ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఇక ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన సర్కారీ వారి పాట చిత్రంలో నటిస్తున్నారు.

Also read:నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -