Tuesday, May 14, 2024
- Advertisement -

మహేశ్ సినిమా కథ గురించి రామ్ చరణ్ కు మాత్రమే తెలియాలి!

- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం “శ్రీమంతుడు” విడుదలకు సిద్ధం అయ్యింది. మరి ఈ సినిమా కథేంటి.. అనేది అభిమానుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించే అంశమే. ఈ సినిమా ఎలా ఉంటుందో..

అనే దాని గురించి బోలెడంత ఎగ్జయిట్ మెంట్ తో ఉన్నారు అభిమానులు. మరి ఇదే సమయంలో ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. 

‘శ్రీమంతుడు” దర్శకుడు కొరాటాలశివ. ప్రభాస్ తో ‘మిర్చి’ వంటి సూపర్ హిట్ ను రూపొందించిన సినిమా దర్శకుడితను. మిర్చి తర్వాత కొరటాలను రామ్ చరణ్ పిలిపించుకొన్నాడు. వారిద్దరి కాంబినేషన్ లో సినిమా ఖాయమైందని వార్తలు వచ్చాయి. చాలా రోజుల పాటు వార్తల్లో నిలిచిన ఆసినిమా అంతటితోనే ఆగిపోయింది. చెర్రీ మాత్రం కృష్ణవంశీ సినిమాతో బిజీ అయిపోయాడు. అది కూడా వచ్చింది.. వెళ్లిపోయింది.. అయితే కొరటాల చాలా రోజల పాటు చరణ్ కోసం ఎదురుచూసి చివరకు మహేశ్ తో సినిమా ఇప్పటికి పూర్తి చేశాడు

మరి అప్పట్లో చరణ్ తో ప్రతిపాదనగా వచ్చి.. ఆగిపోయిన కథనే ఈ దర్శకుడు మహేశ్ బాబుతో రూపొందించాడా? అనే సందేహాలున్నాయి. చాలా రోజులుగా ఉన్న సందేహాలే అయినా.. ఆ సినిమా విడుదల నేపథ్యంలో ఇది ఆసక్తిని రేకెత్తించే అంశమే అవుతోంది. మరి కొరటాల మాత్రం ఇది చరణ్ తో అనుకొన్న కథ కాదు.. వేరేది అని అంటున్నాడు. కానీ అసలు విషయం మాత్రం.. రామ్ చరణ్ కు పక్కాగా తెలిసి ఉంటుంది. ఆయనకు కూడా ‘శ్రీమంతుడు’ విడుదలై చూస్తేనే ఇది అదేనా.. కాదా.. అనే విషయంపై క్లారిటీ వస్తుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -