- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సినిమా తరువాత చాలకాలం గ్యాప్ తీసుకుని సైరా మూవీ మొదలు పెట్టారు.సైరా మూవీ చారిత్రక నేపథ్యంతో కూడిన చిత్రం కావడంతో సినిమా ఆలస్యం అవుతుంది.ఇంతవరకూ 30 శాతం చిత్రీకరణను మాత్రమే జరుపుకుంది. సినిమా పూర్తి కావడానికి చాలా టైమ్ పడుతుంది.ఈలోపు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు చిరు.
అభిమానులకి తనకి మధ్య అంత గ్యాప్ రాకూడదని చిరంజీవి ఈ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తన కోసం కథ సిద్ధం చేయమని కొరటాల శివని కొరారని ఆయన కూడా మెగాస్టార్తో సినిమా కావడంతో ఓకే అన్నారని సమాచారం.సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట.మరి ఇది ఎంత వరుకు నిజమో తెలియాల్సి ఉంది.
