- Advertisement -
ఆది పినిశెట్టి కెరీర్ స్టార్టింగ్లో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు.తరువాత కాలంలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్లో మంచి స్థానం ఏర్పరచుకున్నాడు. చాలా రోజుల తరువాత ఆది మళ్లీ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ‘నీవెవరో’ అనే సినిమాలో ఆది హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు హరినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేయడానికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ వస్తున్నాడు. కొరటాల శివ చేతుల మీదుగా రేపు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో తాప్సీ, రితికా సింగ్లు హీరోయిన్స్గా నటిస్తున్నారు.