గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రాజా ది గ్రేట్ చిత్రం తర్వాత రవితేజ నటించిన చిత్రాలు వరుసగా ఫెయిల్ అవుతున్న విషయం తెలిసిందే. దాంతో ఈసారి తనకు సెంట్ మెంట్ హిట్ ఇస్తున్న పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మరోసారి మెరవబోతున్నాడు.
ఈ ట్రైలర్ లో తనదైన శైలిలో రవితేజ చెబుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి. ‘శంకర్. పోతురాజు వీరశంకర్, ఒంగోలు నడి సెంటర్లో నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా’ అంటూ మాస్ డైలాగుతో రవితేజ అలరిస్తున్నాడు.
ఈ చిత్రంలో విలన్లుగా సుముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, రవిశంకర్ లు విలన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ను వినొచ్చు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక బలుపు చిత్రం తర్వాత మరోసారి రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించడం విశేషం.