Friday, May 3, 2024
- Advertisement -

కన్ఫామ్..వైసీపీ బరిలో కృష్ణంరాజు సతీమణి!

- Advertisement -

రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీప దూసుకుపోతోంది. సిట్టింగ్‌ల మార్పు గెలుపు వ్యూహంలో ఒక ఎత్తుగడ అయితే సినీ గ్లామర్‌ని కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు జగన్. ఇందులో భాగంగా అలీ, వివి వినాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా తాజాగా దివంగత నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవిని ఎన్నికల బరిలో దించేందుకు రెడీ అవుతోంది వైసీపీ. నర్సాపురం నుండి వైసీపీ అభ్యర్థిగా శ్యామలాదేవి పోటీలో ఉండటం దాదాపు ఖాయమైంది.

గతంలో బీజేపీ తరపున కృష్ణంరాజు ఎంపీగా పనిచేశారు. బీజేపీ పెద్దలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. అయితే కృష్ణంరాజు చనిపోయిన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నశ్యామలాదేవి ప్రత్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కృష్ణంరాజు జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రస్తుతం తాను కృష్ణంరాజు జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ లపై దృష్టి సారించానని తెలిపారు. నర్సాపురం నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి కృష్ణంరాజు ఎంతగానో పాటుపడ్డారని ఆయన బాటలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావడం ఖాయమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -