ఓపక్క ఎన్టీఆర్ బయోపిక్తో హీరో బాలకృష్ణ సందడి చేస్తుంటే, దానికి పోటీగా వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కూడా తెగ హడవిడి చేస్తోంది. బాలయ్య నటించిన కథానయకుడు సినిమా ఈ రోజే విడుదల అయింది. దాని కన్నా ఓ రోజు ముందు అంటే నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి రెండో సాంగ్ను విడుదల చేశాడు వర్మ. గతంలో వెన్నపోటుపై మొదటి సాంగ్ను విడుదల చేసిన వర్మ, తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి రెండో సాంగ్ను విడుదల చేశాడు. ఎందుకు అనే సాగే ఈ పాటను సిరాశ్రీ రాయగా కళ్యాణి మాలిక్ స్వరపరచి పాడారు. ఈ పాటలో అసలు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, దానికి గల కారణల గురించి వివరించాడు.
అసలైన ఎన్టీఆర్ బయోపిక్ నేను తీసేదే అంటున్నాడు వర్మ. ఈ పాట చివరిలో వర్మ చెప్పిన మాటాలు ఘాటుగా ఉన్నాయి. అబద్దాల వెనుక దాగి ఉన్న నిజాలను,నిజాలకు మసి పూసినట్లుగా ఉన్న అబద్దాలను బండకేసి కొట్టి ఉతికి ఆరేయడమే అంటూ వర్మ పాట చివరిలో తన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. జయప్రద,జయసుధ,శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లు వదిలిపెట్టి ఇలా లక్ష్మీ పార్వతి గురించి ఎందుకు సినిమా తీస్తున్నానో తన తరువాత పాటలో తెలియజేస్తానని అంటున్నాడు. ఏది ఏమైనప్పటికి బాలయ్య తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రాని క్రేజ్ , వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్కు వస్తోందని అనడంలో ఎటువంటి సందేహం లేదని అంటున్నారు నెటిజన్లు.
- Advertisement -
బాలయ్య తీసిన బయోపిక్కు రాని క్రేజ్ వర్మకు ఎందుకు వస్తోంది…?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -