తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్లు తెలుగు తెరపై సందడి చేశాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ నటించి, నిర్మించారు. అయితే వెండితెర మీద ఎన్టీఆర్ బయోపిక్ అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. అయినప్పటికి కూడా మరో రెండు సినిమాలు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నాయి. వాటిలోరామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటి కాగా, మరోకటి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’.
తాజాగా ఈ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’సినిమా టీజర్ను విడుదల చేశారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి ఇంట్లో ప్రవేశించిన దగ్గర నుంచే మొదలవుతోంది. లక్ష్మీపార్వతి ఇంట్లోకి ప్రవేశించగానే దీపాలు ఆరిపోయినట్లు, గద్ద అక్కడే తచ్చాడినట్లు టీజర్లో చూపించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది చూపించనున్నట్లు కేతిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -