పూరీ జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది బాలీవుడ్ భామ అనన్య పాండే. తన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’తోనే బాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులు కొల్లగొట్టింది. ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ లో అలరించబోతోంది. తాజాగా అనన్య పాండే పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ వార్త .. ఫిల్మ్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది.
కొంత కాలంగా బాలీవుడ్ యువ నటుడు, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్తో అనన్య రిలేషన్లో ఉన్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖాళీ పీలీ’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరి మధ్య షూటింగ్ సమయంలోనే స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసిందని చెబుతున్నారు. తరుచు కలిసి హాలీడే ట్రిప్స్ ఎంజాయ్ చేయడం, షాహిద్ ఇంట్లో జరిగే వేడుకల్లో అనన్య పాల్గొనడం లాంటివి చూస్తే వీరి మధ్య బంధం ఉందన్న వార్తల్లో నిజముందే ప్రచారం జరిగింది.
తాజాగా అనన్య , ఇషాన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు రావడం హాట్ టాపిక్ గా మారింది. పరస్పర అంగీకారంతోనే వీరు విడిపోతున్నట్లు తెలుస్తోంది. మరి వీరి మధ్య ఎక్కడ చెడిందన్నది చర్చనీయాంశంగా మారింది.