- Advertisement -
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరో గా వస్తున్న తాజా చిత్రం ‘లోఫర్’. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోని విడుదల చేయగా, ఈ చిత్రాన్ని ఈ నెల 18 న విడుదల చేయాలని ఈ చిత్ర బృందం భావించింది.
అయితే పలు కారణాల రిత్యా ఈ చిత్రాన్ని ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఈ చిత్ర నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. మథర్ సెంటి మెంట్ తో సాగే ఈ చిత్రం లో వరుణ్ తల్లిదండ్రులుగా రేవతి- పోసాని కృష్ణ మురళి నటించారు.
ఈ చిత్రం వరుణ్ సరసన దిశాపఠాని హీరోయిన్ గా నటించింది. విభిన్న కథాంశాలతో వరుసగా రెండు హిట్లు అందుకున్న వరుణ్, లోఫర్ తో హ్యాట్రిక్ కొడతాడో లేదో వేచిచూడాలి.