బాలయ్య.. యువ దర్శకుడు గోపిచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే ఇప్పటికే గోపిచంద్ .. బాలయ్యకు కథను వినిపించాడట. అయితే ఈ కథలో చిన్న చిన్న మార్పులు బాలకృష్ణ సూచించినట్టు సమాచారం.
గోపిచంద్ మలినేని ‘డాన్శీను’ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత రవితేజతో బలుపు, ఇటీవల వచ్చిన క్రాక్ సైతం సక్సెస్ అయ్యాయి. ఇక సాయిధరమ్ తేజ్ తో విన్నర్ సినిమా తీశాడు. గోపిచంద్ చాలా కాలం పాటు శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేశాడు. అతడి చిత్రాల్లో ఆ కామెడీ మార్కు కనిపిస్తూ ఉంటుంది. ఇక క్రాక్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చాడు. దీంతో అతడు మళ్లీ గాడిలో పడ్డాడు. అయితే క్రాక్ హిట్ కావడంతో బాలయ్య .. గోపిచంద్ కు చాన్స్ ఇచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో అఖండ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య అఘోరా గా కనిపిస్తున్నాడు. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తికాగానే.. గోపిచంద్ తో మూవీ తీసే అవకాశం ఉంది. అయితే గోపిచంద్ చెప్పిన కథలో బాలకృష్ణకు క్లైమాక్స్ నచ్చలేదట. హీరో ఎలివేషన్స్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా నచ్చలేదట. దీంతో మార్చమని ఆయన సూచించాడని టాక్. ఇందుకోసం గోపిచంద్ మూడు నెలల టైమ్ తీసుకున్నాడట. ఆ తర్వాతే ఈ మూవీకి సెట్స్ మీదకు రాబోతున్నది.
Also Read