Friday, May 3, 2024
- Advertisement -

ఏకంగా మూడు సిమిమాలను రీమేక్ చేస్తున్న దిల్ రాజు..!

- Advertisement -

నిర్మాతగా దిల్ రాజ్ కెరీర్ మొదలైనప్పటి నుంచి ఎక్కువగా డైరెక్ట్ మూవీస్ నే నిర్మిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన వరుసగా రీమేక్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే హిందీ పింక్ మూవీ ఆధారంగా పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ మూవీ నిర్మించాడు దిల్ రాజు. తాజాగా ఆయన హిందీలో వరుసగా మూడు ప్రాజెక్టులను రీమేక్ చేస్తున్నారు. ఆ మూడు సినిమాలు కూడా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచినవే.

తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ చక్కటి విజయం సాధించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీ లో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో హిట్ అయిన ‘హిట్’ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ఇప్పుడు దిల్ రాజు ముచ్చటగా మూడో సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అతి త్వరలోనే ఈ మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది సినిమా రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా దిల్ రాజు రీమేక్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవ్వాళ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. దిల్ రాజు వరుసగా మూడు రీమేక్ లు చేస్తుండడంతో బాలీవుడ్ మీడియా ఆయనను రీమేక్ రాజుగా పిలుస్తోంది.

Also Read

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా లైన్లోనే.. ఆగిపోలేదట..!

ఐకాన్ మూవీలో బన్నీ రోల్ పై షాకింగ్ న్యూస్…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -