Friday, April 26, 2024
- Advertisement -

బాప్ రే…వెయ్యి మందితో లైగర్ క్లైమాక్స్ సీన్..!

- Advertisement -

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, కరణ్ జోహర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ కిక్ బాక్సర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 65 శాతం పూర్తయింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ మూవీ షూటింగ్ తిరిగి త్వరలోనే మొదలుకానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఆసక్తి కలిగిస్తోంది. లైగర్ క్లైమాక్స్ సన్నివేశాలను సుమారు వెయ్యి మంది తో చిత్రీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1000 మందితో క్లైమాక్స్ అంటే లైగర్ ఏ స్థాయిలో నిర్మితమవుతుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1000 మందితో షూటింగ్ అంటే రిస్కుతో కూడిన వ్యవహారం కావడంతో కరోనా పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర లో నటిస్తోంది. ఇందులో విజయ్ తల్లిగా ఆమె కనిపించనున్నట్లు టాక్. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నప్పటికీ ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని సమాచారం.

Also Read


మెగా చిన్నోడికి మరో బంపర్​ ఆఫర్​..!

ఎవరూ ఊహించని రేంజ్​లో గని డిజిటల్​ మార్కెట్​

జనాలు ఓటీటీలకు అలవాటయ్యారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -