- Advertisement -
మహేశ్ తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా డెహ్రాడూన్ లో జరుగుతోంది. డెహ్రాడూన్ షెడ్యూల్ పూర్తి కావడంతో తదుపరి షెడ్యూల్ కోసం అమెరికా వెళ్లనుంది. కొన్నిరోజుల విరామం తరువాత ఈ సినిమా టీమ్ అమెరికా వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో కీలకమైన సన్నివేశాలతో పాటు, హీరో హీరోయిన్ల మధ్య రెండు సాంగ్స్ను చిత్రీకరించనున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతు సమస్యలపై పోరాడే యువకుడిగాను మహేశ్ బాబు కనిపించనున్నాడు. ఈ సినిమాలో మహేశ్కు జోడిగా పూజా హెగ్డె నటిస్తుంది. దిల్ రాజు,అశ్వినీదత్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.