ఇప్పటికే రెండు చిత్రాలతో బిజీగా ఉన్న ప్రిన్స్ మహేశ్బాబు మరో సినిమాను త్వరలో ప్రారంభించనున్నాడు. భరత్ అను నేను సినిమా తర్వాత ఇంకో సినిమా చర్చల్లో ఉన్నారు. మహేశ్బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
వంశీ పైడిపల్లి దాదాపు రెండేళ్ల తర్వాత ఊపిరి సినిమా అనంతరం మహేశ్తో చేస్తున్న సినిమా ఇదే. దిల్ రాజు, అశ్వినిదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేశ్బాబు కెరీయర్లో ఇది 25 వ సినిమా. నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. త్వరలో ఈ సినిమా విశేషాలు అధికారికంగా చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది.