Tuesday, April 30, 2024
- Advertisement -

మహేశ్ రాజమౌళి స్టోరీ అదేనట.. రాజమౌళి క్లారిటీ !

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా రాజమౌళి ప్రకటించారు కూడా. దాంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. మహేశ్ తో రాజమౌళి ఎలాంటి సినిమా తీయబోతున్నాడు ? కథ ఎలా ఉండబోతుంది ? ఇలాంటి ప్రశ్నలు సినీ అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఆ మద్య ఇంటర్నేషనల్ టోరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న జక్కన్న.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ గ్లోబ్ ట్రాకింగ్ పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంటని చెప్పి ఒక్కసారిగా అంచనాలను విపరీతంగా పెంచారు.

ఇక తాజాగా ఈ మూవీ స్టోరీ సంబంధించి మరో హింట్ ఇచ్చారు జక్కన్న.. ఇటీవల ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ మూవీ స్టోరీ గింరించి మాట్లాడుతూ ” తనకు అడ్వంచర్ సినిమాలంటే ఇష్టమని.. మహేశ్ తో తీయబోయే సినిమా ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇప్పటివరకు రాని యాక్షన్ అడ్వంచర్ మూవీ అని క్లారిటీ ఇచ్చారు. ఈ స్టోరీ స్క్రిప్ట్ వర్కు గత రెండు నెలల నుంచి జరుగుతోందని, హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ రేంజ్ లో ఉంటుందని చెబుతూ.. ఇదొక ప్రపంచాన్ని చుట్టే యాత్ర అంటూ ” మూవీ స్టోరీకి సంబంధించిన హింట్ ఇచ్చారు జక్కన్న. దీంతో మహేశ్ ఫ్యాన్స్ విపరీతంగా ఖుషీ అవుతున్నారు.

ఇక ఈ మూవీ కోసం దాదాపుగా 800 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది జూన్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందట. మరి ఇప్పటివరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన రాజమౌళి.. మహేశ్ మూవీతో వరల్డ్ బాక్సాఫీస్ పై గట్టిగానే గురి పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

చిరుకు సమ్మర్ లో కూడా తప్పని పోటీ..!

తెలుగు తమిళ్ మద్య చిచ్చు పెట్టిన విజయ్ తలపతి!

వామ్మో..వీరసింహారెడ్డిలో 11 యాక్షన్ సీన్స్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -