Sunday, April 28, 2024
- Advertisement -

సమ్మర్లో మహేష్ , బన్నీల మధ్య డిష్యుం డిష్యుం

- Advertisement -

టాలీవుడ్లో ఇప్పటి హీరోలంతా కూల్ గా ఉంటారని వారి మధ్య ఎలాంటి అరమరికలు లేవని అంతా అంటూ ఉంటారు. నేటి తరం హీరోలను చూసాక అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే స్టేజ్ లపై వీరు చేసే పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఎంతో దోస్తానా ఉన్నట్లు కనిపిస్తుంది. కాని సమ్మర్లో వచ్చే రెండు చిత్రాల ద్వారా హీరోల మధ్య ఎలాంటి సఖ్యత ఉందో తెలిసిపోయింది. పైగా ఆ హీరోలిద్దరు టాప్ హీరోలాయె.

సమ్మర్లో మహేష్ ,బన్నీల మధ్య డిష్యుం డిష్యుం జరగబోతుంది. ఏప్రిల్ 27న నా పేరు సూర్య విడుదల చేస్తున్నామని బన్నీ అండ్ కో అనౌన్స్ చేశారు. అదే రోజున భరత్ అను నేను రిలీజ్ కూడా ఉంటుందని కొరటాల టీం ప్రకటించింది. ఇక్కడే ఇద్దరి హీరోలకు మధ్య క్లాష్ వచ్చింది. ఇలాంటి పోటీ ఏమాత్రం మంచిది కాదని పరిశ్రమ పెద్దలు చెబుతున్నారు. బన్నీ బ్యాచ్ డేట్ అనౌన్స్ చేశాక ఆ తేదీన కాకుండా ముందు వారమో తర్వాతి వారమో సినిమా డేట్ ప్రకటించాలి గాని… ఇలా ఒకే రోజు రెండు చిత్రాలు ఉండేలా ఎలా ప్రకటిస్తారని చెబుతున్నారు.

ఇంకొందరు కావాలనే కొరటాల శివ ఆ డేట్ ఫిక్స్ చేశాడంటున్నారు. నా పేరు సూర్య రిలీజ్ డేట్ బన్నీ మార్చితే ఇలా డేట్ అనౌన్స్ చేశారనే మాట కూడా వినిపిస్తుంది. నిర్మాతలిద్దరికీ రిలీజ్ డేట్ పై చర్చలు జరిగాయనే రూమర్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఏది ఏమైనా ఇద్దరూ ఇలా ఒకే డేట్ కు వచ్చి.. ఎవరికి సరిపడా థియేటర్లు లేక ఇబ్బంది పడే కంటే ఒక్కో వారం ఒకరు పంచుకోవడం ఉత్తమమని అంతా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -