Thursday, May 2, 2024
- Advertisement -

రాజ‌కీయ ఆరంగ్రేటంపై క్లారిటీ ఇచ్చిన భ‌ర‌త్

- Advertisement -

సూప‌ర్ స్టార్ మహేశ్‌ బాబు శుక్రవారం విజయవాడలో సందడి చేశారు. ‘భరత్‌ అనే నేను’ సినిమా విజయం సాధించడంతో మహేశ్‌ నగరంలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం పాత్ర‌లో మ‌హేష్ అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.

సినిమాలో సీఎంగా న‌టించిన మ‌హేష్ రాకీయాల్లోకి వ‌స్తారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ పుకార్ల‌పై మ‌హేష్ స్పందించారు. వందేళ్లు వచ్చే వరకూ సినిమాల్లోనే నటిస్తాను తప్ప.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. భరత్‌ అనే నేను విజయోత్సవంలో భాగంగా విజయవాడలో పర్యటించింది మూవీ టీమ్‌. విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉందన్న ఆయన.. ఇక్కడికి రావడం సెంటిమెంట్‌గా ఫీలవుతానన్నారు మహేష్‌ బాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -