శ్రీమంతుడు సినిమా ప్రిన్స్ మహేశ్బాబుకు బంపర్హిట్గా నిలిచిన సినిమా. తర్వాత స్పైడర్ సినిమా వచ్చినా ఆశించిన ఫలితం లేదు. ఆ సినిమా తర్వాత మహేశ్ చేస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలోని ఓ పాటలో మహేశ్ శ్రీమంతుడు సినిమాలో లుంగీలో కనిపించిన మాదిరి మొత్తం ఓ పాటంతా పంచెకట్టుతో డ్యాన్స్ చేయనున్నాడట.
2006లో వచ్చిన ‘పోకిరి’లో ‘చూడొద్దంటున్నా’ పాటలో మహేశ్ లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేయగా 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’లో మహేశ్ లుంగీలో ఓ సీన్ చేశాడు. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ సినిమాలో మాత్రం మహేశ్ ఓ పాట మొత్తంలో పంచెకట్టుతోనే కన్పించనున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్గా బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ, దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఏప్రిల్ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సినిమా బృందం ప్రయత్నాలు చేస్తోంది.