- Advertisement -
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.మహేశ్ పుట్టిన రోజున విడుదల చేసిన టీజర్ బిట్కు మంచి స్పందన వచ్చింది.తాజాగాఈ సినిమా నుంచి మరో టీజర్ వస్తుందని సమాచారం.టీజర్ను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
అంతే కాకుండా ఫిబ్రవరి నెలలోనే ఈ చిత్రానికి సంబందించిన మొదటి పాటను కూడా విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఈ సినిమాలో మహేశ్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తారని సమాచారం.ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తుంది.ఇక ఈ సినిమాను వచ్చే ఏప్రిల్లో విడుదల చేయనున్నారు.