Wednesday, May 1, 2024
- Advertisement -

సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోనున్న మహేష్

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శత్వంలో నటించి మహర్షి సినిమా తో అందర్నీ మెప్పించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించిన తరుణం లో అభిమానులందరూ మహేష్ బాబు తరువాత చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఉంది అని తెలుసుకొని సంతోషించారు. ఇప్పటివరకు ఫ్లాప్ ఏ ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష బాబు నటించడం విశేషం అందుకే అభిమానులు ఎంతో ఉత్సాహం తో వేచి చూస్తున్నారు.

ఇది ఇలా ఉంచితే మీడియా లో మహేష్ బాబు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ తరువాత ఎం చేస్తాడు అనే విషయం మీద చాలా రూమర్స్ తిరుగుతున్నాయి. ఒక వైపు రాజమౌళి ఈ సినిమా ని దర్శకత్వము వహిస్తడు అనుకుంటే మరొక వైపు త్రివిక్రమ్ శ్రీనివాస్, పరశురామ్, సందీప్ రెడ్డి వంగ పేర్లని కూడా పరిశీలన లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ఎవరి వైపు మొగ్గు చూపుతాడు అనేది ఇంకా తెలియదు. ఈ ఏడాది చివరి లో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ముగింపు దశ కి వచ్చే సమయానికి కానీ మహేష్ బాబు ఒక నిర్ణయానికి రాడు అని అతని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. చిట్టచివరికి ఏం అవుతుందో మరి కొద్ది రోజులు ఆగితే మనకి తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -