పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను ఉద్దేశిస్తూ దర్శకుడు రామ్గోపాల్ వర్మ చేసిన వరుస ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్- రానా ప్రధాన పాత్రలు పోషించిన భీమ్లానాయక్పై ఆర్జీవీ హాట్ కామెంట్స్ చేశారు. భీమ్లానాయ్ను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేసి.. మీ పవర్ ఏంటో చూపించడంటూ.. పవన్ కల్యాణ్కు సూచిస్తూ రామ్గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
ఇటీవల విడుదలైన ‘పుష్ప’ బీటౌన్లో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్ సాధించిందని.. కాబట్టి ‘భీమ్లానాయక్’ని సైతం పాన్ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నారు. ‘పుష్ప’యే అంత వసూళ్లు రాబడితే.. మరి, మీ సినిమా ఎంత కలెక్ట్ చేయాలి? ‘భీమ్లానాయక్’ పాన్ ఇండియా రిలీజ్ చేయకపోతే మీ అభిమానులమైన మేమంతా వేరే హీరో అభిమానులకు సమాధానం చెప్పలేం. ఇటీవల నేను అల్లుఅర్జున్ గురించి పెట్టిన ట్వీట్స్ అన్నీ వోడ్కా టైమ్లో పెట్టాను. కానీ, ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైమ్లో పెడుతున్నా. ఇప్పటికైనా నా సీరియస్నెస్ అర్థం చేసుకోండి. మీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్చరణ్, తారక్లు కూడా పాన్ఇండియా స్టార్స్ అయిపోతుంటే మీరు ఇంకా తెలుగులోనే సినిమాలు చేయడం మాకు బాధగా ఉంది. దయచేసి ‘భీమ్లానాయక్’ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయండి అని ఆర్జీవో ట్వీట్ చేశారు.
అంతేకాదు గతంలో తాను ‘సర్దార్గబ్బర్సింగ్’ని హిందీలో రిలీజ్ చేయవద్దని, అక్కడ వర్కౌట్ కాదని అప్పట్లో ట్విటర్ వేదికగా చెప్పాననీ… కానీ మీరు వినలేదు. ఫలితం చూశారు. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. ‘భీమ్లానాయక్’ని ఏ మాత్రం తగ్గకుండా పాన్ఇండియా స్థాయిలో విడుదల చేయండి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ‘పుష్ప’, ‘కొమరం భీమ్’, ‘అల్లూరి సీతారామరాజు’ కథలు పాన్ఇండియా అయినప్పుడు ‘భీమ్లానాయక్’ కథ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా?’’ అంటూ వర్మ.. పవన్ని ప్రశ్నించారు. ఆర్జీవో చేసిన ఈ ట్వీట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెను దుమారమే రేపుతోంది.
ఒకే సారి 20 వేల థియేటర్లలో ఆదిపురుష్