- Advertisement -
హీరోలను తమ గుండెల్లో పెట్టి చూసుకుంటారు అభిమానులు.మరి అలాంటి హీరోలను తక్కువ చేసి మాట్లాడితే ఇంకా వారి అభిమానులు ఊరుకుంటారా? తాజాగా ఇలాంటి సంఘటనలనే టాలీవుడ్లో జరిగాయి.రీసెంట్ గా ఆర్టిస్ట్ ఆదర్శ్ బాలకృష్ణ.. ఎన్టీఆర్ తో తీసుకున్న ఫోటో షేర్ చేస్తూ ఎన్టీఆర్ ని గౌరవంగా సంబోధించలేదని అభిమానులు అతడిపై విరుచుకుపడ్డారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ‘గూఢచారి’ హీరోయిన్ శోభిత దూళిపాళ్లకి ఎదురైంది.
‘గూఢచారి’ సినిమా హిట్ అయిందని మహేష్ బాబు టీమ్ కి శుభాకాంక్షలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టారు. దానికి స్పందనగా శోభిత ‘థాంక్యూ’ అని చెప్పింది. ఈ ఒక్క ట్వీట్ తో ఆమె సమస్యల్లో ఇరుక్కుంది. ‘థాంక్యూ’ అని చెప్పి ఊరుకోవడం ఏంటి..? రెస్పెక్ట్ ఎక్కడ అంటూ శోభితను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మహేశ్ ఫ్యాన్స్.ఇప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.