Sunday, May 5, 2024
- Advertisement -

ఫ్యాన్స్ నుంచి పవన్ కు హెచ్చరికలు !

- Advertisement -




ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ క్షణం తీరిక తేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. పాలిటిక్స్ లో ఎంత యాక్టివ్ గా ఉంటున్నప్పటికి.. మూవీస్ ను సైతం నిర్లక్ష్యం చేయకుండా షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం పవన్ ” హరి హర వీరమల్లు ” మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పవన్ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ మూవీ చివరి దశకు వచ్చింది. ఇక శరవేగంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. .

ఇక ఈ మూవీ తరువాత కూడా పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ కు కమిటయ్యారు పవన్. ఈ ప్రాజెక్ట్ ను కూడా త్వరలో స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ మూవీతో పాటు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న హరీష్ శంకర్ ప్రాజెక్ట్ ను కూడా ఒకే సారి సెట్స్ పైకి తీసుకెల్లే ఆలోచనలో పవన్ ఉన్నారట. కాగా పవన్ తో ” భవదీయుడు భగత్ సింగ్ ” అనే ప్రాజెక్ట్ ను హరీష్ శంకర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిస్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆ స్క్రిప్ట్ ను పక్కన పెట్టి తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి మూవీని తెలుగులో రీమేక్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట పవన్ అండ్ హరీష్.

దాంతో పవన్ అభిమానులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలుగులో కూడా విడుదల అయిన తేరి ( పోలీసోడు ) మూవీని మళ్ళీ ఎందుకు రీమేక్ చేస్తున్నారని, ఇలా రీమేక్ ఇతర కథలను రీమేక్ చేయడం పవన్ ఇమేజ్ ను దెబ్బతిస్తుందని ఆయన అభిమానులు ట్విట్టర్ లో గోల గోల చేస్తున్నారు. పవన్ తో సినిమా తీస్తే కొత్త కథతో రావాలని లేదంటే మనుకోవాలని హరీష్ కు వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. ఇక పవన్ కూడా సరైన కథలను ఎంచుకోవాలని అభిమానులు ఆయనకు సూచిస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు పవన్ హరీష్ కొత్త కథకు వెళ్తారా ? లేదా తేరి రీమేక్ వైపే మొగ్గు చూపుతారా ? అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -