Tuesday, April 23, 2024
- Advertisement -

మహేశ్ – నాగ్- ఐశ్వర్యరాయ్ కాంబోలో మణిరత్నం సినిమా!

- Advertisement -

కొన్ని నెలల క్రితమే మహేశ్ బాబు, నాగార్జున ల కాంబినేషన్ లో మణిరత్నం ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు మణిరత్నం ‘ఓకే బంగారం’ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

ఈ నేపథ్యంలో గతంలో ప్రతిపాదనలోకి వచ్చిన ఆ సినిమా ఇప్పుడు పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మరింత విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కూడా నటించబోయే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

మహేశ్ బాబు, నాగార్జున కాంబినేషన్ లో తన భర్త మణిరత్నం సినిమా చేయబోతున్నాడని స్వయంగా సుహాసిని ప్రకటించింది. దీంతో ఆ సినిమా పట్టాలెక్కడం ఖాయమనుకొన్నారంతా. అయితే ఎందుకో అది మొదలుకాకుండానే ఆగిపోయింది. బహుశా మణిరత్నం వరస ప్లాఫుల మధ్య ఉండటంతో అలా జరిగి ఉండవచ్చు. అయితే ‘ఓకే బంగారం’ సినిమాతో మళ్లీ మణిరత్నం తన పూర్వపు ఫామ్ ను సంతరించుకొన్నాడు.

 ఈ నేపథ్యంలో ఆ సినిమా ను పట్టాలెక్కించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యేలా ఉన్నాయి. ఇక ఐశ్వర్యరాయ్ కి మణిరత్నం అంటే ప్రత్యేక అభిమానం. ఆయన దర్శకత్వంలోవచ్చిన సినిమాతోనే నటిగా ఆమె కెరీర్ మొదలైంది. ఇప్పుడిప్పుడే సెకెండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆ హీరోయిన్ ఇప్పుడు మళ్లీ మణి దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పింది. దీంతో మహేశ్, నాగార్జునల కాంబినేషన్ లో సినిమాకు ఐశ్వర్యరాయ్ పుణ్యమా అని నేషనల్ లెవల్ క్రేజ్ వస్తుంది. దీంతో ఈ హీరోలు కూడా ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -