ప్రస్తుతం టాలీవుడ్ని షేక్ చేస్తున్న మూవీ ఆర్ఎక్స్ 100.చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.రెండున్నర కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, నిర్మాతకు, బయ్యర్లకు నాలుగు రేట్లు లాభాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా.ఇప్పటికి కొన్ని చోట్ల బాగానే రన్ అవుతుంది.అలాంటి సినిమాపై మంచు లక్ష్మి కామెంట్స్ చేసింది.బోల్డ్ సినిమాలకు.. వల్గర్ సినిమాలకు తేడా ఉందని.. మహిళల్ని తక్కువగా చూపించడాన్ని తాను ఖండిస్తానని మంచు లక్ష్మి చెప్పింది. ఆమె ఇలా కామెంట్ చేయడం వెనక ఓ కారణం ఉంది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆప్ రామ్ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా ఫర్వాలేదని టాక్ ఉన్నప్పటికి ఆర్ఎక్స్ 100 మూవీ ముందు వైఫ్ ఆప్ రామ్ ఎవరు చేడటం లేదు.దీంతో ఆమె ఇలాంటి కామెంట్స్ చేసిందని కొందరు భావిస్తున్నారు.ఇంకా మంచు లక్ష్మి మాట్లాడుతు వల్గారిటీని హైలైట్ చేసే సినిమాల కంటే ‘మహానటి’.. ‘పెళ్ళిచూపులు’.. ‘క్షణం’ లాంటి సినిమాల్ని తాను ఎక్కువ ఇష్టపడతానని మంచు లక్ష్మి చెప్పింది.ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ని వల్గర్గా , మోసకారిగా చూపించరని పరోక్షంగా ఆర్ఎక్స్ 100 మూవీ పేరు ఎత్తకుండా ఈ సినిమాపై సైటెర్ వేసింది.కాని ఆర్ఎక్స్ 100 దర్శక నిర్మాతలు మాత్రం సినిమాలో పెయిన్ చూడాలి కాని వల్గారిటీని కాదని,సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే సినిమా అంతలా హిట్ అయిందని చిత్ర దర్శకుడు మహేశ్ భూపతి తెలిపారు.