Thursday, May 9, 2024
- Advertisement -

హరికృష్ణ అంత్యక్రియలలో అందరి మ‌న‌స్సుల‌ను గెలుచుకున్న మంచు మ‌నోజ్‌

- Advertisement -

టీడీపీ మాజీ ఎంపీ నంద‌మూరి హ‌రికృష్ణ బుధ‌వారం జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.అభిమాని ఇంట్లో పెళ్లి కోసం నెల్లురు వెళ్తుండ‌గా న‌ల్గొండ జిల్లా అన్నేప‌ర్తిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.హరికృష్ణ అంత్యక్రియలు నిన్న(గురువారం) జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. తెలంగాణా ప్రభుత్వం స్టేట్ హానర్స్‌తో హరికృష్ణ ను గౌరవించారు.ఇక హ‌రికృష్ణ ఫ్యామిలీకి తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం అండగా నిలబడ్డారు.

అయితే హీరో మంచు మ‌నోజ్ నిన్న జ‌రిగిన హరికృష్ణ అంత్యక్రియలలో అందరి మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నాడు. నందమూరి కుటుంబంతో మంచు ఫ్యామిలీ వారి స్నేహం బంధం ఎప్ప‌టి నుంచో కొనసాగుతుంది.ఎన్టీఆర్‌-మ‌నోజ్‌లు కూడా మంచి స్నేహితులు.వీరిద్ద‌రి పుట్టిన రోజు కూడా ఒక రోజే కావ‌డం విశేషం. నిన్నజ‌రిగిన హరికృష్ణ అంత్యక్రియలలో స్నేహితుడు అయిన ఎన్టీఆర్‌కు మంచు మనోజ్ బాసటగా నిలిచాడు. అంతిమ యాత్ర సమయంలోనూ – అంత్యక్రియల సమయంలో ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేస్తు ,వారిని ఎన్టీఆర్ -కళ్యాణ్ రామ్ మీదకు రాకుండా కంట్రోల్ చేస్తూ అన్నదమ్ములకు ఇబ్బంది లేకుండా చూడడం అందరి దృష్టిని ఆకర్షించింది.

తాజాగా మ‌నోజ్ ట్వీట్ట‌ర్‌లో హరికృష్ణ గారు రాసిన లెట‌ర్‌ను పోస్ట్ చేస్తు ,తాను 5 లక్షలు హరికృష్ణ అంకుల్ జ్ఞాపకార్థంగా కేర‌ళ‌కు విరాళంగా ఇస్తున్నాన‌ని నందమూరి అభిమానులను – తెలుగు సినిమా ప్రేమికులను విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరాడు.నందమూరి అభిమానులతో పాటు ప్ర‌తి ఒక్క‌రు మనోజ్ మంచి మనసుకు ఫిదా అయ్యి ప్రశంసిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -