మంచు విష్ణు నటిస్తున్న`ఆచారి అమెరికా యాత్ర` సినిమా వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాల్సి ఉండగా అనుకోని కారణాల రీత్యా సినిమా వాయిదా వేసినట్లు మంచు విష్ణు ట్విట్టర్లో ప్రకటించాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనూహ్యంగా విడుదల వాయిదా పడడం అందరికీ ఆశ్చర్యపరిచింది.
దేనికైనా రెడీ, ఆడోరకం ఈడోరకం లాంటి వినోదాత్మక సినిమాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కలయికలో ఈ సినిమా వస్తోంది. చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం కమెడియన్గా వస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, అనూప్ సింగ్ థాకూర్ విలన్గా కనిపించనున్నాడు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ లతో రూపొందుతోంది. ఖండాంతరాలు దాటి అమెరికాకు వెళ్లిన బ్రహ్మణులు ఏం చేశారు? అమెరికాకు ఎందుకు వెళ్లారు? అనే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని ట్రైలర్ను చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో హాస్యంతో మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. పద్మజ పిక్చర్స్ బ్యానర్పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మిస్తున్నారు.