Thursday, April 25, 2024
- Advertisement -

మన్మధుడు హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుంది ఏం చేస్తుందో తెలుసా?

- Advertisement -

అన్షు అంబానీ అంటే పెద్దగా గుర్తు పట్టకపోయినా “మన్మధుడు” హీరోయిన్ అంటే అందరికి టక్కుమని ఈమె రూపం కళ్ల ముందు కదులుతుంది.మన్మధుడు సినిమాలో ఎంతో అమాయకంగా నటించి అందరినీ ఆకట్టుకున్న అన్షు ఆ తర్వాత ప్రభాస్ సరసన “రాఘవేంద్ర” సినిమాలో నటించారు. కనిపించింది రెండు సినిమాలు అయినప్పటికీ రెండు సినిమాలలో కూడా ఈమె చనిపోయే పాత్రలో నటించారు. ఈ రెండు సినిమాల తర్వాత తెలుగు తెరకు దూరమైన అన్షు అంబానీ ప్రస్తుతం ఏం చేస్తుందో ఎక్కడుందో తెలుసుకుందాం…

గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో అన్షు అంబానీ చనిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపించాయి. అయితే అవన్నీ కేవలం అపోహలేనని తాను ఎంతో సంతోషంగా తన కుటుంబంతో కలిసి లండన్ లో సెటిల్ అయిపోయి అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఇండస్ట్రీకి ఒక అతిథిలా వచ్చి వెళ్ళిన అన్షు లండన్ కి చెందిన ఒక వ్యాపారవేత్త సచిన్‌ సగ్గార్‌ను పెళ్లాడి లండన్‌లోనే సెటిల్‌ అయిపోయింది.

Also read:రాజమౌళి షార్ట్ ఫిలిం.. ఆర్ఆర్ఆర్ కంటే ముందే విడుదల!

అన్షు లండన్ లో ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తూ, లండన్ లోనే ఇన్‌స్పిరేషన్‌ కౌచర్‌ అనే డిజైనింగ్‌ షాప్‌ కూడా ఉంది. అక్కడ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ హీరోయిన్లు వేసుకునే దుస్తులనే తిరిగి రెడీ చేయించి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈమె సినిమాలలో తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి సమ్మతంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయం గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ అభిమానులు సైతం ఏమి సినిమాలలోకి వస్తే ఎంతో బాగుంటుంది అనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Also read:యాంకర్ శ్యామల ఖరీదైన విల్లా వీడియో.. మీ అయన కొట్టేసిందేనా అంటూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -