హీరోయిన్ రష్మిక ‘ఛలో’ అనే చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతకన్నా ముందే కన్నడలో ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో క్రేజ్ తెచ్చుకుంది రష్మిక.అయితే దర్శకుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది రష్మిక త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతుంది.ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘గీత గోవిందం’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు చిత్ర యూనిట్.ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మికపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ఎంగేజ్మెంట్ చేసుకున్న తరువాత కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఎలా చేస్తావంటూ ఆమెను తప్పుబట్టారు. అయితే రష్మిక కూడా వారికి ధీటైన సమాధానం చెప్పింది. ‘మగాళ్లు పెళ్లయిన తరువాత కూడా వేరే హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయొచ్చు.దానికి మీకు ఎలాంటి సమస్య ఉండదు. అదే హీరోయిన్లు పెళ్లి తరువాత ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే.. మాత్రం మీరు తట్టుకోలేరని తెలిపింది.