పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగ రాసింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారు. శింబు హీరోగా చేస్తున్న ఈ సినిమాకు C. సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా లై ఫేం మేఘా ఆకాష్ను ఎంపిక చేశారు.
తెలుగులో ప్రణీత పోషించిన పాత్ర కోసం క్యాథరిన్ ట్రెసాను ఎంపిక చేశారని కోలీవుడ్ టాక్. సరైనోడు’ సినిమాలో హాట్ ఎమ్మెల్యేగా నటించి తెలుగువారిని మెప్పించిన క్యాథరిన్ ఇప్పుడు శింబుతో కలిసి నటించనుందని తెలుస్తుంది. హీరోయిన్గా క్యాథరిన్కు సరైన హిట్ లేదు.ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నప్పటికి ఆమెకు హిట్లు మాత్రం రావడం లేదు.తెలుగులో ఘన విజయం సాధించిన ఈ సినిమా తమిళంలో ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి.