Monday, May 13, 2024
- Advertisement -

హ్యాట్సాఫ్……. పూరీ మనసు పెడితే మేజిక్ ఇలా ఉంటుంది….. హాలీవుడ్ రేంజ్‌లో

- Advertisement -

తెలుగు సినిమాకు కొత్త నడకను నేర్పించిన డైరెక్టర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే అందులో ప్రప్రథమ వరుసలో రామ్ గోపాల్ వర్మ పేరు కచ్చితంగా ఉంటుంది. అలాంటి వర్మను ఆదర్శంగా తీసుకుని ఎదిగిన దర్శకుడు పూరీ జగన్నాథ్. మనసు పెట్టి, కష్టపడి తీస్తే పూరీ జగన్నాథ్ టాలెంట్ ముందు ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ కూడా వెనకడుగు వేస్తారనడంలో సందేహం లేదు. కానీ పూరీ శైలి అంతా టైం పాస్ వ్యవహారంలా ఉంటుంది. ఏదో ఒకటి మేనేజ్ చేసి పైసా వసూల్ అనిపిద్దాం అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా చేసుకుని కెరీర్‌ని పూర్తిగా డౌన్ చేసేసుకున్నాడు పూరీ.

కానీ అలాంటి పూరీ జగన్నాథ్ ప్రతిభను బయటికి తెప్పించగలిగాడు అతని కొడుకు ఆకాష్. మొదటి సినిమాతో డిజాస్టర్ ఎదుర్కున్న ఆకాష్ నటునిగా కూడా ప్రామిసింగ్‌గా అనిపించలేకపోయాడు. అందుకే కొడుకును హీరోగా నిలబెట్టాల్సిన బాధ్యత పూరీపై పడింది. ఆకాష్ కోసం ప్రేక్షకులకు థియేటర్స్‌కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి బాధ్యత అంతా పూరీ జగన్నాథ్ భుజస్కంధాలపైనే పడింది. ఆ బాధ్యతను అద్భుతంగా తీసుకున్నాడు పూరీ. తాజాగా రిలీజ్ అయిన పూరీ జగన్నాథ్ మెహబూబా టీజర్ అదిరిపోయింది. టీజర్‌లో ఉన్న ప్రతిషాట్ కూడా తెలుగు స్టాండర్డ్స్‌ని మించి ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హై స్టాండర్డ్స్‌లో ఉంది. కెమేరా వర్క్ అయితే సినిమాని పూర్తిగా హాలీవుడ్ స్టాండర్డ్స్‌కి తీసుకెళ్ళింది. వార్ బ్యాక్ డ్రాప్‌లో లవ్ స్టోరీ అంటేనే కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక పూరీ జగన్నాథ్ లాంటి టాలెంటెడ్ రైటర్ అయితే అంతకుమించి అనే స్థాయిలోనే రాసి ఉంటాడు. మొత్తానికి టైం పాస్ వ్యవహారంలో కాకుండా మెహబూబా సినిమాని ఓ స్థాయిలో నిలపడానికి పూరీ ప్రయత్నం చేస్తున్నాడన్న హింట్ అయితే టీజర్‌తో వచ్చింది. సినిమా లవర్స్ అందరినీ మెప్పించే స్థాయిలో ఉన్న టీజర్ మెహబూబా పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలానే ఉంది. సినిమా కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దాడో లేదో తెలియాలంటే మాత్రం సమ్మర్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -