- Advertisement -
సంగీత దర్శకులు ఎమ్ఎమ్ కీరవాణి రెండో కుమారుడు సింహా కోడూరి హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నాడు. ఓ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింతో సింహా కోడూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. గతంలో సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు సింహా కోడూరి.
ఇప్పుడు హీరోగా పరిచయం చేయడానికి కావాల్సిన అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన చేయనున్నారు. కీరవాణి మారుడు కాల భైరవ సింగర్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.