Tuesday, May 14, 2024
- Advertisement -

నువ్వానేనా అంటున్న మోహ‌న్‌బాబు, విష్ణు

- Advertisement -

‘గాయత్రి’ ట్రైల‌ర్ విడుద‌ల‌

నువ్వానేనా అన్న మాదిరి తండ్రీ కొడుకులు పోరాడుతున్నారు. వీరు పోటీ ప‌డుతున్న‌ది న‌ట‌న‌లో. డాక్ట‌ర్ మంచు మోహ‌న్‌బాబు, విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్నసినిమా ‘గాయత్రి’. ‘ఆ రోజుల్లో రాముడు చేసింది తప్పే అయితే నేను చేసింది కూడా తప్పే’ అనే క్యాప్షన్‌తో ఇటీవ‌ల విడుద‌లైన మోహ‌న్‌బాబు లుక్ ఆక‌ట్టుకుంది. శ్రియ‌, మంచు విష్ణు ఉన్న ఫ‌స్ట్‌లుక్‌లు కూడా విడుద‌ల చేసి సినిమా ప్ర‌చారం చేసేస్తున్నారు. ఇటీవ‌ల సినిమా టీజ‌ర్ విడుద‌ల కాగా ఇప్పుడు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌ద‌న్ రామిగ‌ని ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో మోహ‌న్‌బాబు రాయ‌ల‌సీమ రామ‌న్నచౌద‌రి గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు. ఒక ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఫైట్ చేస్తూ డైలాగ్‌లు చెబుతున్న తీరు బాగుంది.

రామాయ‌ణం ఒక ఆడ‌దాని ఏడుపు వ‌ల్ల జ‌రిగింది. మ‌హాభార‌తం ఒక ఆడ‌దాని న‌వ్వు వ‌ల్ల జ‌రిగింది. గాయ‌త్రి ప‌టేల్ ప్ర‌తీ పేజీ క్రైమ్ పేజీ రా! అంటూ మోహ‌న్‌బాబు డైలాగ్‌లు అదిరేలా చెప్పారు. సినిమాల‌కు దూర‌మైనా త‌న న‌ట‌న‌లో ఎలాంటి మార్పు లేద‌ని చూపించారు. సినిమాల‌కు మ‌ళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది.ఈ సినిమాలో శ్రియ‌, నిఖిల విమ‌ల న‌టిస్తున్నారు. సంగీతం ఎస్‌ఎస్ థ‌మ‌న్ అందిస్తున్నారు. వేస‌విలో ఈ సినిమా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

https://www.youtube.com/watch?v=oymjqNIhFt4

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -