మాస్రాజా రవితేజ అంటే అందరికి తన నటనలోని ఎనర్జి గుర్తుకు వస్తుంది.కాని గత కొంత కాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్నాడు రవితేజ.తన సినిమాలు వస్తుంటే అందరి హీరోల ఫ్యాన్స్ క్యూ కడతారు.కాని అలాంటి పరిస్థితి నుండి రవితేజ సినిమానా అనే స్థాయికి వెళ్లిపోయాడు.ఇక రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ.ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.ఇలియానా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణ సంస్థ రవితేజతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ రాయించుకున్నారు.
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజతో మరో సినిమా చేయాలనుకున్నారు. తమిళ మూవీ తేరి మూవీని తెలుగులో రీమేక్ చేయలని భావిస్తున్నారు. సంతోష్ స్క్రిప్ట్ మీద నమ్మకం కోల్పోయిన మైత్రి మూవీ మేకర్స్ ఇక ఈ సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడక పోవడంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.