Tuesday, April 23, 2024
- Advertisement -

ఆరు రోజుల్లో థ్యాంక్యూకి గుడ్ బై చెప్పనున్న చైతూ..!

- Advertisement -

యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా ఫినిష్ చేశాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా థ్యాంక్యూ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇప్పుడు నిలిచిపోయిన మిగతా పార్ట్ ని చిత్రీకరించడానికి డైరెక్టర్ విక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు. మరో ఆరు రోజుల షూటింగ్ తో ఈ సినిమా కంప్లీట్ అవుతుంది. హైదరాబాద్ లోనే చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే నాగచైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న మూవీకి షిఫ్ట్ అవనున్నారు.

Also Read: ఆట ఫెమ్ గీతిక ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

అద్వైత్ చందన్ డైరెక్షన్ లో అమీర్ ఖాన్ హీరోగా లాల్ సింగ్ చద్దా అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగచైతన్య ఓ కీలకమైన పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. తర్వాతి షెడ్యూల్ కార్గిల్లో జరగనుంది. కార్గిల్ లో జరిగే షెడ్యూల్లో నాగచైతన్య పాల్గొననున్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా ఫారెస్ట్ గంప్ కు హిందీ రీమేక్ గా లాల్ సింగ్ చద్దా నిర్మితమవుతోంది.

Also Read: రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -