Friday, April 26, 2024
- Advertisement -

తెరపైకి వచ్చే మొదటి సినిమా నాగ చైతన్యదే..!

- Advertisement -

కరోనా కారణంగా ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి సినిమాలు విడుదలకు నోచుకోలేదు. చాలా సినిమాలు షూటింగ్ పూర్తయినప్పటికీ థియేటర్లు మూతపడడంతో విడుదల కాలేకపోయాయి. మూడు నెలల విరామం తర్వాత మళ్లీ పరిస్థితులు చక్క పడడంతో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా సడలింపులు ఇచ్చారు. థియేటర్లు కూడా ఓపెన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఏపీలో ఇటీవలి వరకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బయట తిరిగేందుకు అనుమతి ఉండగా, ప్రస్తుతం అక్కడ కూడా కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు ఇచ్చారు.

ఇవాల్టి నుంచి ఏపీలో రాత్రి పది గంటల వరకు అన్నిటికీ అనుమతించనున్నారు. థియేటర్లలో సినిమాలు విడుదల చేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చారు. మార్నింగ్, మ్యాట్నీ, ఫస్ట్ షోలు, అంటే మూడు షో లు వేసుకునేందుకు అనుమతి ఉంది. దీంతో నిర్మాతలు ఆగిపోయిన తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా నాగచైతన్య,సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన లవ్ స్టోరీ సినిమా ముందుగా తెరపైకి రానున్నట్లు సమాచారం.

లవ్ స్టోరీ సినిమా ను జూలై 23 న విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత నారాయణ దాస్ నారంగ్ తెలియజేశారు. అయితే 24 న వెంకటేష్ నటించిన నారప్ప సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుండడంతో ఆయన ఆలోచనలో పడినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేసి 30వ తేదీన థియేటర్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమా విడుదలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Also Read

ఓటీటీలో ఈ వారం వస్తున్న సినిమాలు ఇవే

పవర్​స్టార్​ ​​- హరీశ్​శంకర్​​ మూవీ సబ్జెక్ట్​ ఇదే?

మెగా చిన్నోడికి మరో బంపర్​ ఆఫర్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -