మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ – పవర్ స్టార్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. పవన్ ప్రస్తుతం చేస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్, హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే హరీశ్ శంకర్ గతంలో పవన్ కల్యాణ్కు గబ్బర్ సింగ్ రూపంలో భారీ బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మాస్ ఎలివేషన్స్ గట్టిగా చూపించడంలో హరీశ్ శంకర్ది అందె వేసిన చెయ్యి. అంతేకాక.. హరీశ్ శంకర్ స్వయంగా రచయిత కావడంతో.. డైలాగులు కూడా అద్భుతంగా రాస్తాడు.
ఇక సాయిధరమ్ తేజ్ తో తీసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అల్లు అర్జున్ తో తీసిన డీజే, వరుణ్ తేజ్తో తీసిన గద్దల కొండ గణేశ్ సూపర్ హిట్ అయ్యాయి. ఇలా మెగా కాంపౌండ్ డైరెక్టర్గా స్థిరపడ్డాడు హరీశ్ శంకర్. పవన్ కల్యాణ్తో హరీశ్ శంకర్ తీయబోయే మూవీ సందేశాత్మంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ రెండు విభిన్న తరహా పాత్రల్లో కనిపిస్తాడట. విద్యా వవస్థలోని లోపాలను వ్యంగ్యంగా చూపించబోతున్నట్టు టాక్.
మరోవైపు పవర్ స్టార్ రెండు క్యారెక్టర్లలో ఒకటి సాఫ్ట్ కార్నర్లో మరో పాత్ర కాస్త యాంగ్రీ యంగ్మ్యాన్లా ఉండబోతున్నదని టాక్. ఇక డైలాగులు కూడా కాస్త పదునుగానే ఉంటాయని సమాచారం. ఇప్పటికే హరీశ్ శంకర్ కొన్ని డైలాగులు వినిపించగా.. పవన్ కల్యాణ్ ఫిదా అయినట్టు టాక్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు.
Also Read
మాస్ డైరెక్టర్తో విజయ్ దేవరకొండ మూవీ?