Thursday, May 2, 2024
- Advertisement -

మళ్లీ జతకడుతున్న మనం జోడీ

- Advertisement -

ఇప్పుడంతా ఓటీటీ హవానే. పేరున్న నటీనటులంతా ఇప్పుడు ఓటీటీ వైపే అడుగులు వేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సైతం ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. బంగార్రాజు హిట్‌తో దూకుడు మీదు ఉన్న చైతూ…తొలిసారిగా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ను చైతూ ఫేవరేట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్నాడు.

అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో నాగ చైతన్య దూత కనిపించబోతున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దూత వెబ్ సిరీస్‌ను విక్ర‌మ్ రూపొందిస్తున్నాడు. అయితే నాగచైతన్య ఎవరికి దూతగా వ్యవహరిస్తాడన్నది సస్పెన్స్‌ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో థాంక్యూ అనే సినిమా తెరకెక్కుతోంది. రాశీ ఖన్నా నాయిక. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇటీవలే థాంక్యూ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మనం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో థాంక్యూపైనా భారీ అంచనాలు ఉన్నాయి. విక్రమ్ కె కుమార్‌ కొత్త ఐడియాలను తెరకెక్కిస్తాడనే పేరుంది. దూత వెబ్ సిరీస్‌లో కూడా ఏదో వైవిధ్యత ఉంటుందనే ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సామ్

భారీ బడ్జెట్ తో సీరియల్

జోరుమీదున్న రంగ‌మ్మ‌త్త‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -