Saturday, April 27, 2024
- Advertisement -

ప్రేమికుల రోజు..చైతూ- పల్లవి స్పెషల్ రీల్

- Advertisement -

వాలెంటైన్స్ డే సందర్భంగా క్యూట్ రీల్‌తో అదరగొట్టారు అక్కినేని నాగచైతన్య – సాయి పల్లవి. ప్రస్తుతం నాగచైతన్య హైదరాబాద్ లో ఉండగా సాయి పల్లవి జపాన్ లో ఉన్నారు. ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా స్పెషల్ రీల్ చేశారు. ఉన్న సాయి పల్లవి కలిసి ఇన్‌స్టాగ్రామ్ లో రీల్ చేశారు.

చైతూ – సాయిపల్లవి ఇద్దరూ తండేల్ సినిమాలో నటిస్తుండగా షూటింగ్‌కు గ్యాప్ రావడంతో మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది సాయిపల్లవి. ఓ బాలీవుడ్ సినిమా షూట్‌లో పాల్గొనేందుకు జపాన్‌కు వెళ్లారు.

తండేల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్‌లో చైతన్య చెప్పే బుజ్జితల్లి.. వచ్చేస్తున్నా కదే.. కాస్త నవ్వే.. అనే డైలాగ్ ను ఇద్దరూ కలిసి రీల్ చేస్తూ వాలెంటైన్స్ డే విషెస్ తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారగా జంట క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -