హీరో నాగచైతన్యపై ఆయన తండ్రి నాగర్జున అసూయపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగ్ తన ట్వీట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు.నాగచైతన్య మహనటి సినిమాలో ఏఎన్నాఆర్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి ఒక వీడియోను సిద్ధం చేసిన చిత్రబృందం సినిమా రిలీజ్ తరువాత ఈ వీడియోను విడుదల చేసింది.ఇందులో నాని వాయిస్ ఓవర్ తో సాగిన స్పీచ్ ఏఎన్నాఆర్ గొప్పతనాన్ని తెలియజేస్తు సాగుతుంది.
దీనిపై స్పందించిన నాగ్ ”తండ్రిగా గర్వపడుతున్నా.. కొడుకుగా అసూయ పడుతున్నా.. నాన్నగారి పాత్రలో నేను ఇప్పటివరకు నటించలేదు. కానీ ఆ పాత్రలో చైతు నటించడం ఆనందంగా అనిపిస్తోంది. చైతు అద్భుతంగా నటించాడు” అని తెలిపారు. ‘మహానటి’ సినిమాలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలో పోషించారు. ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు, జెమినీ గనేషన్ గా దుల్కర్ సల్మాన్, కెవి రెడ్డిగా క్రిష్, ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్ లు నటించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిచింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.
Am today a proud father and a jealous son. I never played my father legendary #ANR Garu. But, I am overwhelmed and very happy to present to you all, Chay as ANR in #Mahanati #ANRliveson 👉 https://t.co/v1FdzRajcp pic.twitter.com/yCWJYDLmb8
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 10, 2018