టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి నాగార్జునకు పెద్దగా అభ్యంతరాలు ఉండవనే విషయం ఇప్పటికే తెలిసిందే. ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్కు మంచి క్రేజ్ ఉంది కానీ.. దాదాపు దశాబ్దం క్రితమే ఇలాంటి ప్రయత్నం చేశాడు నాగార్జున.
2008లో నాగార్జున, మంచు విష్ణు కలిసి కృష్ణార్జున సినిమా చేశారు. ఈ సినిమాలో నాగ్ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. అలాగే ఇటివల్ కార్తితో కలిసి ఊపిరి సినిమాలో నటించాడు. ఇవి కుర్ర హీరోలతో చేసిన చిత్రాలు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో మల్టీస్టారర్ సినిమాలు చేయడం పై నాగార్జున ఉద్దేశ్యం ఏంటి..? అయితే తాజా ఓం నమో వేంకటేశాయ ప్రమోషన్స్ భాగంగా ఇదే ప్రశ్న నాగ్ కు ఎదురైంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లలో.. ఎవరితో అయిన మల్టీ స్టారర్ సినిమా చేయడానికి తాను రెడి అని చెప్పాడు నాగార్జున.
కొత్త కథలను ప్రేక్షకులు కోరుకుంటున్నారని.. నాగ్ అన్నారు. సీనియర్ స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ కి రెడీ అయినా.. ఇద్దరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉంటే తప్పకుండా చేస్తానని అన్నారు నాగ్. సినిమా కథలో కేరక్టర్లకు ఇచ్చే ప్రాధాన్యంలో తేడా ఉంటే.. ఫ్యాన్స్ ఫీల్ అవుతారని.. అలా కాకుండా ఇద్దరికి సమానమైన ప్రాధాన్యం ఇచ్చే కథతో ఎవరైనా ముందుకు వస్తే.. ఖచ్చితంగా మల్టీస్టారర్ చేస్తానని అన్నారు నాగ్.
Related