తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ మూడో సీజన్కు రంగం సిద్దం చేసుకుంటుంది. మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ కావడంతో మూడో సీజన్పై అందరి దృష్టి పడింది. మొదటి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్గా వ్యవహారించాడు. తన యాక్టింగ్తో మొదటి సీజన్కు విపరీతమైన క్రేజ్ను తెచ్చిపెట్టాడు ఎన్టీఆర్. ఇక రెండో సీజన్కు వ్యాఖ్యతగా చేశాడు న్యాచురల్ స్టార్ నాని. రెండో సీజన్లో నాని తనదైనశైలిలో ఆకట్టుకున్నాడు. రెండో సీజన్కు కూడా విపరీతమైన రేటింగ్స్ సాధించింది. తాజాగా మూడో సీజన్కు రెడీ అవుతోంది బిగ్బాస్.అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బిగ్బాస్ వంటి షోలకి ఇకమీద యాంకరింగ్ చేయనని నాని రెండో సీజన్లోనే చెప్పేశాడు.
దీంతో కొత్త హోస్ట్ను వెతికే పనిలో పడింది బిగ్బాస్ యాజమాన్యం. దీనిలో భాగంగానే టాలీవుడ్ సన్సేషన్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, వెంకటేశ్, రానా వంటి పేర్లు వినిపించాయి. కాని చివరికి కింగ్ నాగర్జునను ఫైనల్ చేశారు బిగ్బాస్ యాజమాన్యం. నాగ్కు గతంలో ఇలాంటి రియాల్టీ షోలకు పని చేసిన అనుభవం ఉండటంతో నాగ్ను యాంకర్గా ఫిక్స్ చేశారు. నాగ్ గతంలో మీలో ఎవరు కోటేశ్వరుడు వంటి షోకి యాంకర్గా పని చేశాడు. నాగర్జున ప్రస్తుతం మన్మథుడు -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ప్యారిస్ వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి రాగనే బిగ్బాస్ -3 కోసం పని చేయనున్నాడు నాగ్. ఈ సినిమాలో నాగర్జున సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ సినిమాకు రాహుల్ రవింద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ నుంచి నాగ్ వచ్చేలోపు కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి చేయలని చూస్తుంది బిగ్బాస్. ఈసారి కాస్తా ఫేమస్ అయిన ఆర్టిస్ట్లను కంటెస్టెంట్లగా తీసుకోవాలని భావిస్తుందట బిగ్బాస్ యాజమాన్యం. దీనిలో భాగంగానే ప్రముఖ యాంకర్ ఉదయభానుని మొదటి కంటెస్టెంట్గా తీసుకున్నాట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమెకు రోజుకి 2 లక్షలు ఇచ్చి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.